హైదరాబాద్, జూలై 8 : యూత్ ఫుల్ ఎంటర్టైనర్లతో ఆకట్టుకుంటున్న యువ దర్శకుడు మారుతి. ఒక పక్క దర్శకుడిగా బిజీగా ఉంటూనే మరోవైపు కొత్త టాలెంట్ ని ప్రోత్సహించే విధంగా నటీనటులు కొత్త దర్శకులతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తూనే ఉంటాడు. తాజాగా "బ్రాండ్ బాబు" అంటూ ప్రేక్షకులను అలరించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మారుతి సమర్పిస్తున్న ఈ చిత్రానికి బుల్లితెర స్టార్ యాంకర్ పీ ప్రభాకర్ దర్శకత్వం వహిస్తుండగా శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై శైలేంద్ర బాబు నిర్మిస్తున్నారు. జీవన్ బాబు సంగీతం అందించాడు. ఈ చిత్రం ద్వారా కన్నడ నటుడు సుమంత్ శైలేంద్ర తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఆయన సరసన ఈషా రెబ్బా హీరోయిన్గా నటి౦చనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ టైటిల్ పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది.