ముంబై, జూలై 3 : బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు ముంబై మున్సిపల్ కార్పోరేషన్ నోటీసులు జారీ చేసింది. ముంబై నగరంలోని అంథేరిలో ఒషివారా వద్ద ఉన్న వాణిజ్య సముదాయంలో అక్రమంగా నిర్మాణాలు చేశారని బృహన్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఐదుగురు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారి ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ అధికారులు 2013లో ముంబై మున్సిపల్ అధికారుల మంజూరు చేసిన ప్లాన్కు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్టుగా గుర్తించారు. దీంతో ప్రియాంక చోప్రాకు మున్సిపల్ అధికారులు రెండు నోటీసులు జారీ చేశారు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని లేని పక్షంలో చర్చలు తీసుకుంటామని తెలిపారు.