హైదరాబాద్, జూలై 1 : ఒకప్పుడు కామెడీ చిత్రాలంటే గుర్తొచ్చే పేరు రాజేంద్రప్రసాద్. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసింది ఎవరు అంటే అల్లరి నరేష్ అనడంలో అతిశయోక్తి లేదు. నేడు అల్లరి నరేష్ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సోషల్మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం నరేష్ షూటింగ్ నిమిత్తం డెహ్రాడూన్లో ఉన్నారు. ప్రిన్స్ మహేశ్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 25వ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు వంశీ పైడిపల్లి తన ట్విట్టర్ వేదికగా.. "నా సినిమాలో ‘రవి’ పాత్ర పోషిస్తున్న నరేశ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనతో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభూతి" అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ సినిమా సెట్లోనే చిత్ర యూనిట్ నరేశ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆదివారం ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.