కడప, జూన్ 30 : కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంపీ సీఎం రమేశ్ చేస్తోన్న ఆమరణ నిరాహారదీక్ష నేటితో 11వ రోజుకు చేరింది. ఎంపీకి రిమ్స్ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రమేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు వెల్లడించారు. గుండె, మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. దీక్ష చేస్తోన్న రమేశ్ను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరి కాసేపట్లో కడపకు రానున్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు. 11 రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న కేంద్రం నుండి ఎటువంటి స్పష్టమైన హామీ రాలేదు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు ఉక్కు కర్మాగారంపై ఈ రోజు ప్రకటన చేసే అవకాశం ఉంది.