పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలు: ఉత్తమ్‌

SMTV Desk 2018-06-29 13:43:12  Uttam Kumar Reddy, tpcc chief Uttam Kumar Reddy, charms ststem, tpcc, hyderabad

హైదరాబాద్‌, జూన్ 29 : రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశముందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చార్మ్స్‌(కాంగ్రెస్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) టెలీకాన్ఫరెన్స్‌ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలని.. ప్రతి ఒక్కరూ శక్తియాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. ఓటరు గుర్తింపు కార్డు నంబరును 79961 79961 ఫోన్‌ నెంబరుకు మెసేజ్‌ చేయడం ద్వారా శక్తి సభ్యులుగా నమోదు చేసుకోవచ్చన్నారు. గురువారం గాంధీభవన్‌ నుంచి పార్టీ శ్రేణులతో ఉత్తమ్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా మాట్లాడారు. చార్మ్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌ఛార్జి మదన్‌మోహన్‌రావుతో కలిసి ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఏ పార్టీ వినియోగించడం లేదన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు గాంధీభవన్‌ నుంచి మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు 508 మందితో ఈ విధానం ద్వారా మాట్లాడతామన్నారు.