హైదరాబాద్, జూన్ 28 : బహుబాషా కోవిదుడు.. తెలంగాణ ముద్దుబిడ్డ.. మౌన ముని మాజీ ప్రధాని దివంగత పాములపర్తి వెంకటనరసింహారావు.. జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీవీ జ్ఞానభూమిలో ఆయన సమాధికి తెలంగాణ హోం మంత్రి నాయిని పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బహుభాషా కోవిదుడు, నూతన ఆర్ధిక సంస్కరణలను దేశానికి పరిచయం చేసిన ఆర్ధిక వేత్త అని కొనియాడారు. మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపిన ఘనత పీవీదేనని.. పీవీ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు సమంజసం కాదన్నారు. టీడీపీ ఎంపీల నివాళి.. పీవీ నరసింహరావుకు తెలుగుదేశం ఎంపీలు ఘన నివాళి అర్పించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో పీవీ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భగా జేసీ దివాకర్రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశానికి ప్రధానులు చేసిన వారందరిలో పీవీ నరసింహరావుది ప్రత్యేక శైలి అని కొనియాడారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన ఘనత పీవీదేనని అన్నారు.