వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండలో TRS కార్పొరేటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇటీవల TDP నుంచి TRS లోకి చేరిన కార్పొరేటర్ అనిశెట్టి మురళీని దుండగులు వేట కొడవళ్లు, తల్వార్లతో పైశాచిక దాడి చేసి చంపేశారు. తర్వాత దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. 25 ఏళ్ల క్రితం జనార్దన్ హత్య కేసులో మురళీ నిందితుడని.. జెన్నీ కొడుకులే పగబట్టి చంపారని ప్రాథమిక నిర్ధారణ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున జనార్దన్ కార్పొరేటర్గా పనిచేశారు. గురువారం (జులై 13) హన్మకొండలో భారీ వర్షం కారణంగా ఎటు వెళ్లకుండా కుమార్ పల్లి ప్రాంతంలోని తన ఇంట్లోనే ఉన్నారు మురళి. అదే అదనుగా చూసుకొని వారు ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.