హైదరాబాద్, జూన్ 23 : అగ్ర కథానాయకుడు మహేశ్బాబు తన పిల్లలు గౌతమ్, సితారతో వీలైనప్పుడల్లా సమయం గడుపుతుంటారు. ఆయన సతీమణి నమ్రత.. వారి కుటుంబానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్మీడియాలో పంచుకుంటూ ఉంటారు. తాజాగా నమ్రత మహేష్ బాబు, సితార ఇద్దరు కలిసి ఉన్న వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేశారు. టేబుల్ దగ్గర ఓ వైపు మహేష్ మరో వైపు కూతురు సితార ఫన్నీగా హావభావాలను అనుకరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్లిప్పింగ్ కొన్ని రోజుల క్రితం స్పెయిన్ లో తీసిందట. మహేష్ తన ఫ్యామిలీతో హాలీడేస్ ట్రిప్ ను ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. నమ్రత ఈ వీడియోతో పాటు.. "టేబుల్ మీదున్న వారికి మహేశ్, సితార ఏం చేస్తున్నారో, మాట్లాడుకుంటున్నారో తెలియదు" అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 25 వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డెహ్రాడూన్లో ప్రారంభమైంది.
Cuteness unlimited!@urstrulymahesh & #Sitara pic.twitter.com/wk6ylDUa3C
— Telugu Filmnagar (@telugufilmnagar) June 21, 2018