హైదరాబాద్, జూన్ 21 : బాలీవుడ్ సెలబ్రిటీల జంట దీపికా పదుకునే, రణవీర్ సింగ్ లు గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలేక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాని ఈ విషయంపై ఇప్పటివరకు ఒక అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా వీరి పెళ్లిపై ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ 10న వీరి వివాహం జరగనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వివాహ తేదీపై తీవ్ర చర్చల అనంతరం నవంబర్ 10న వెడ్డింగ్కు ఇరు కుటుంబాలూ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఉదయ్ పూర్ లోని విలాసవంతమైన ప్యాలెస్ లో వివాహ వేడుకను నిర్వహించాలని రెండు కుటుంబాలు భావిస్తున్నాయట. ఈ విషయంలో దీపిక ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని.. చేతిలో ఉన్న సినిమాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, వివాహానికి సిద్ధం కావాలని దీపిక, రణవీర్ భావిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.