సిద్దిపేట, జూన్ 21 : సిద్దిపేటలో జిల్లాలో గురువారం దారుణం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని భారత నగర్లో ఓ కుటుంబం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా నివాసముంటున్న హనుమంతరావు అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి తాను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు హాస్పిటల్కు తరలించేలోపే హనుమంతురావుతో సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి హనుమంతరావు భార్య చికిత్స పొందుతుండగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హనుమంతరావు ఓ వార్త పత్రికలో రిపోర్టర్గా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణాలుగా భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఈ ఘాతుకానికి కారణంగా నిర్ధారించినట్లు ఏసీపీ తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.