బెంగళూరు, జూన్ 14: అఫ్గానిస్తాన్తో చారిత్రక టెస్టు మ్యాచ్లో టీమిండియా నిలకడగా ఆడుతుంది. తొలుత టాస్ నెగ్గిన భారత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో భాగంగా లంచ్ విరామ సమయానికి .. 27 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 158 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఓపెనర్లు శిఖర్ ధావన్(104) శతకం సాధించాడు. ఇది తన టెస్ట్ కెరీర్ లో ఏడవ సెంచరీ. మరో వైపు మురళీ విజయ్ కూడా(41) ఆచితూచి ఆడుతున్నాడు. శిఖర్ ధావన్ బౌండరీలతో అఫ్గానిస్తాన్ బౌలింగ్పై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అఫ్ఘాన్ కెప్టెన్ బౌలర్లను మార్చి మార్చి వేయించినా ఫలితం మాత్రం ఉండడంలేదు. ప్రపంచ మేటి బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్ను భారత ఓపెనర్లు అలవోకగా ఆడుతున్నారు. ఇప్పటి వరకు రషీద్.. ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి 51 పరుగులు ఇచ్చాడు. ధవన్ దూకుడుకు.. విజయ్ నిలకడ తోడవడంతో అఫ్ఘాన్ బౌలర్లు ప్రభావం చూపలేకపోతున్నారు.