హైదరాబాద్, జూన్ 12 : టాలీవుడ్లో బెస్ట్ కపుల్ అంటే మొదటిగా గుర్తుకొచ్చేది అక్కనేని నాగార్జున, అమల.26 ఏళ్ల క్రితం "శివ" సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో ఎంత ప్రేమగా ఉన్నారో.. ఈనాటికి అంతకంటే రెట్టింపు ప్రేమతో అన్యోన్యంగా ఉన్నారని చెప్పేయొచ్చు. అయితే ఈ జంట తమ వివాహ వార్షికోత్సవాన్ని తమ కుటుంబ సభ్యుల మధ్య ఎంతో సరదాగా జరుపుకుంది. అయితే ఈ మధురమైన క్షణాలను వారి తనయుడు అక్కినేని అఖిల్.. సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అంతేకాదు "కుటుంబ సభ్యులందరితో లవ్ బర్డ్స్ సంతోషంగా గడిపారు. నేను ఎంతో ప్రేమించే మా అమ్మానాన్నలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎంత గొప్ప ప్రేమకథ" అంటూ ట్వీట్ కామెంట్ పెట్టాడు. అఖిల్ షేర్ చేసిన ఫొటోలో దాదాపుగా అక్కినేని కుటుంబం అంతా కనిపించింది. వారంతా చిరునవ్వుతో ఫోటోకి పోజిచ్చారు. ప్ర్సతుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారింది.