బిగ్‌బాస్ 2.. హౌస్‌లోకి వెళ్లింది ఎవరంటే..!!

SMTV Desk 2018-06-11 10:55:59  bigboss 2, celebrities, hosting actor nani.

హైదరాబాద్, జూన్ 11 : తెలుగులో అత్యంత ప్రజాదారణ పొందిన బుల్లితెర రియాల్టీ షో "బిగ్‌బాస్‌" సందడి మళ్లీ మొదలైంది. ఆదివారం ప్రారంభమైన ఈ షో 106 రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేయనున్న ఈ షోలో మొత్తం 16మంది సభ్యులు పాల్గొంటున్నారు. అందులో 13 మంది సెలబ్రిటీలు కాగా, ముగ్గురు సామాన్యులు పాల్గొంటున్నారు. వీరు ఎవరంటే.. హౌస్‌లోకి వెళ్లిన మొదటి సెలబ్రిటీ నేపథ్య గాయని గీతామాధురి కాగా, తర్వాత వరుసగా అమిత్ తివారీ, న్యూస్ ప్రెజెంటర్ దీప్తి, ప్రముఖ హేతువాది బాబు గోగినేని, నటుడు తనీష్, నటి భానుశ్రీ, రోల్ రిదా, యాంకర్ శ్యామల, కిరిటి దామరాజు, ఇన్‌స్టాగ్రామ్ క్వీన్ దీప్తి సునయన, కౌశల్, తేజస్వీ, సామ్రాట్ రెడ్డి, గణేశ్, సంజన అన్నె (మోడల్), నూతన్ నాయుడు ఉన్నారు. ఫస్ట్ ఎపిసోడ్ లో అందరి పరిచయాలతో ఒక్కొక్కరుగా హౌజ్‌లోకి ప్రవేశించారు. ఇక వీరి సందడి బిగ్‌బాస్‌-2లో చూడబోతున్నాం.