హైదరాబాద్, జూన్ 6 : ప్రిన్స్ మహేష్ బాబు సరికొత్త లుక్ లో దర్శనమిచ్చారు. తన 25వ సినిమాలో మాత్రం సరికొత్తగా కనిపించనున్నాడని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇందుకు మహేష్ భారీ గడ్డం, మీసాలతో కనిపించనున్నాడని రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహేష్ ఫోటో చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. రూమర్స్ అన్నింటికీ ఆజ్యం పోస్తూ నమ్రత పోస్ట్ చేసిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కుటుంబంతో కలిసి విదేశాలకి వెళ్ళిన మహేష్ రీసెంట్గా ఇండియాకి చేరుకున్నారు. అయితే ఎయిర్పోర్ట్లో మహేష్ని చూసిన ఫోటోగ్రాఫర్స్ తమ కెమెరాలో బంధించారు. ఇందులో మహేష్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇదివరకెన్నడు కనిపించని లుక్లో మహేష్ కనిపించడంలతో అభిమానులలో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్రాజు, అశ్వనీదత్ కలిసి నిర్మించనున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.