అగ్ర దర్శకుల అపూర్వ చిత్రం..

SMTV Desk 2018-06-05 11:23:14  tollywood top directers, vamshi aidipalli dinner party, hyderaabad.

హైదరాబాద్, జూన్ 5 : టాలీవుడ్ అగ్రహీరోలంతా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ దృశ్యం ఎంత బాగుంటుందో కదా. చూడడానికి రెండు కళ్ళు చాలవేమో అన్నంతలా అభిమానులకు కనుల పండుగగా కనిపిస్తోంది. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది. దర్శకుడు వంశీ పైడిపల్లి గత రాత్రి తన ఇంట్లో ఓ పార్టీని నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంతా పాల్గొన్నారు. వీరంతా కలిసి ఉన్న ఫోటోను దర్శకుడు వంశీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతేకాదు.. "అద్భుతమైన వ్యక్తులతో మరిచిపోలేని సాయంత్రం గడిపాను" అంటూ కామెంట్ పెట్టాడు. ఈ ఫోటో పెట్టిన కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోటో ఎంతో చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ చిత్రంలో రాజమౌళి, సుకుమార్‌, క్రిష్‌, కొరటాల శివ, హరీశ్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడి, నాగ్‌ అశ్విన్‌, సందీప్‌ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి ఉన్నారు. వీరంతా వారి వారి సినిమా బిజీల్లో ఉన్నా ఇలా ఒక పార్టీలో కలుసుకోవడం అభిమానులకు పండగ లాంటి వార్తే.