ఏలూరు, మే 26 : తనకు ఓటు వచ్చిన కొత్తలో మొదటి సారి ఎన్టీఆర్ కు ఓటు వేశానని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. చిరంజీవి ఏ రోజైతే ప్రజారాజ్యాన్ని మూసేశాడో.. ఆ రోజు నుంచి తాను ఓటరుగానే మిగిలిపోయానని పశ్చిమ గోదావరి ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైసీఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను ఆయన శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..."చిరంజీవి ఏ రోజైతే ప్రజారాజ్యాన్ని మూసేశారో.. ఆ రోజు నుండి నేను ఓటరుగా మిగిలిపోయాను. నాకు ఓటు వచ్చిన కొత్తలో ఎన్టీఆర్కి వేశా. ఆ తర్వాత చంద్రబాబుకు వేశా. ఇప్పుడు ఉన్నవాళ్లలో బెటరెవరో వారికి ఓటు వేస్తా. ఓటరుగా నాకు స్వచ్ఛమైన మంచినీళ్లు కావాలి. ఫర్ఫెక్ట్ కరెంట్ కావాలి. దోమలు లేకుండా ఉండాలి. రోడ్లు శుభ్రంగా ఉండాలి. తినే తిండి కల్తీ లేకుండా ఉండాలి. తినే కూరగాయలు కల్తీ లేకుండా ఉండాలి. ఇప్పటి వరకూ చాలామంది పరిపాలకులను చూశా... గెలవకముందు ఒకలా.. గెలిచిన తర్వాత ఇంకోలా ఉన్నారు. అది నాకు నచ్చలేదు.ఎవరికో ఒకరికి ఓటు వేయాలని కాబట్టి ఇప్పుడున్న నేతల్లో ఎవరైతే బెటరో వాళ్లకి ఓటు వేస్తా " అని వ్యాఖ్యానించారు.