జడేజా భార్యపై దాడి చేసిన కానిస్టేబుల్ పై వేటు..

SMTV Desk 2018-05-23 14:27:01  jadeja wife, ravindra jadeja wife, reeva jadeja constable attack, gujarath

జామ్‌నగర్, మే 23 ‌: టీమిండియా క్రికెట ర్రవీంద్ర జడేజా సతీమణి రీవాపై చేయి చేసుకున్న కానిస్టేబుల్‌ సంజయ్‌ అహిర్‌ (28)ను సస్పెండ్‌ వేటు పడింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయని జామ్‌నగర్‌ ఎస్పీ ప్రదీప్‌ వెల్లడించారు. అయితే ఈ ఘటనపై ఆరాతీసిన (పీఎంఓ) ప్రధాన మంత్రి కార్యాలయం.. స్థానిక ఎమ్మెల్యే ధర్మేంద్రసింగ్‌ జడేజాతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. గుజరాత్ రాష్ట్రం, జామ్‌నగర్‌లో మే 21న టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవా జడేజాపై కానిస్టేబుల్ సంజయ్‌ అహిర్‌ దాడి చేశాడు. తన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినందుకుగాను కానిస్టేబుల్‌ ఆవేశంతో ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చి అత్యంత అమానవీయంగా కొట్టినట్లు ప్రత్యక్షసాక్షి విజయ్‌సింగ్ చవడా తెలిపారు. తాజాగా ఆమెపై దాడి చేసిన కానిస్టేబుల్‌ను అరెస్టు చేసి శాఖాపరమైన విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ప్రదీప్‌ వెల్లడించారు. ప్రస్తుతం రవీంద్ర జడేజా చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.