హైదరాబాద్, మే 21 : కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై నేచురల్ స్టార్ నాని నటించిన "నిన్ను కోరి" చిత్ర౦ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడదే బ్యానర్ పై ఎమ్ వీవీ సినిమాస్ వారితో కలిసి ఓ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటించనుండగా.. తాప్సి .. రితికా సింగ్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. అయితే హీరో నానితో ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడి౦చనున్నారు. ఆది పినిశెట్టి తొలుత హీరోగా చేసి ఆ తర్వాత వరుసగా ప్రతి నాయకుడి పాత్రలను పోషిస్తూ వచ్చాడు. మరలా ఈ చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు దర్శనమివ్వనున్నాడు.
After a heart touching victory of #NinnuKori, Kona Filmcorporation teams up wid MVV cinema for another blockbuster wid Aadhi Pinisetty, Taapsee & Ritika Singh. The title will be unveiled on May 24 at 11:11am by Natural Star Nani. @konavenkat99 @AadhiOfficial @taapsee @ritika_offl pic.twitter.com/4ym9SPF2K9
— Vamsi Kaka (@vamsikaka) May 21, 2018