సుప్రీం ముంగిటకు కావేరి ముసాయిదా..

SMTV Desk 2018-05-14 14:02:13  draft Cauvery management, supreme court, cauvery issue, delhi

ఢిల్లీ, మే 14 : తమిళనాడులో కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటుచేయాల్సిందిగా కొంతకాలంగా రాష్ట్రంలో ఆందోళనలు జరిగిననేపథ్యంలో.. సుప్రీం స్పందిస్తూ మే 4కల్లా ముసాయిదాను సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో కేంద్రం సుప్రీంకోర్టుకు ముసాయిదాను సమర్పించింది. కర్ణాటక ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో ముసాయిదాను సమర్పించలేకపోయారు. దాంతో నీటి వనరుల శాఖ సెక్రటరీ వ్యక్తిగతంగా ముసాయిదాను అందించాలని లేదంటే కేంద్రం కోర్టును ఎదిరించినట్లేనని సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం కేంద్రం ముసాయిదాను కోర్టుకు ఇచ్చింది. కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డును బోర్డు అనాలా? కమిటీ అనాలా? అథారిటీ అనాలా? అన్న విషయాన్ని అత్యున్నత న్యాయస్థానంకు వదిలేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.