మళ్లీ మెరిసిన బట్లర్..

SMTV Desk 2018-05-14 10:39:31  jos buttler, rajastan royals, ipl, mumbai indians

ముంబై, మే 14 : ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే రెండు జట్లకు కీలకమైన మ్యాచ్ లో ముంబై పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ జట్టు పరాజయాన్ని చవిచూసింది. రాజస్థాన్ జట్టులో జోష్ బట్లర్ (94, నాటౌట్) కడదాకా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ ఓటమితో రోహిత్ సేన ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. టాస్ నెగ్గిన రాజస్థాన్ సారథి రహనే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టులో ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు సూర్యకుమార్‌ యాదవ్(38)‌, ఎవిన్‌ లూయిస్‌(60), హార్దిక్‌ పాండ్యా (36) మాత్రమే రాణించారు. 10 ఓవర్లలో 86/6తో నిలిచిన ముంబయికి రెండో భాగంలో రాయల్స్‌ పేసర్లు ఆర్చర్‌ (2/16), స్టోక్స్‌ (2/26) కట్టడి చేశారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ జట్టులో బట్లర్ ఆటే హైలైట్. మ్యాచ్ ఆసాంతం చక్కని షాట్లతో అలరించిన అతను ఇన్నింగ్స్‌కు మూల స్తంభంలా నిలవగా.. అతనికి సారథి రహనే (37) కూడా చేయూతనిచ్చాడు. దీంతో ఆ రాజస్థాన్ జట్టు 18 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ‘మ్యాన్ ఆఫ్ ది’ మ్యాచ్ అవార్డు బట్లర్ కు లభించింది.