నేను అందరికన్నా ఎక్కువ ఆనందంగా వున్నా..

SMTV Desk 2018-05-11 17:59:35  samantha, twitter, 3 movies stills, rangasthalam, mahanati irumbu tirai.

హైదరాబాద్, మే 11 : తెలుగులో "రంగస్థలం", "మహానటి".. తమిళంలో "ఇరుంబు తిరై" చిత్రాలలో నటించి ఒకేసారి హ్యాట్రిక్ కొట్టారు హీరోయిన్ అక్కినేని సమ౦త. సాధారణంగా కథానాయికలు పెళ్లి చేసుకున్న తర్వాత అవకాశాలు తగ్గిపోతాయని అపోహా పడతారు. కాని వీటన్నింటిని పక్కన పెట్టి సమ౦త.. వరుస సినిమా విజయాలతో దూసుకుపోతోంది. "రంగస్థలం" చిత్రం ఘన విజయం సాధించి భారీ కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై ప్రేక్షకులే కాకుండా సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. సావిత్రి జీవిత కథ "మహానటి" చిత్రంలో మధురవాణి పాత్రలో సమ౦తకు అభిమానులు నీరాజనాలు పలికారు. తాజాగా విడుదలైన తమిళ చిత్రం "ఇరుంబు తిరై" సూపర్ హిట్ అయింది. దీంతో సమ౦త ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో సమ౦త.. ఈ మూడు సినిమాలకి సంబంధించిన స్టిల్స్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. "ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ఆనందంగా వున్న అమ్మాయిని నేనే" అంటూ ట్వీట్ చేసింది.