హైదరాబాద్, మే 11 : హీరో సూర్య తమిళంతో పాటు తెలుగులో మంచి క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ తో కలిసి ఓ చిత్రంలో నటించనున్నారు. కేవీ ఆనంద్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. ఈ మేరకు దర్శకుడు ఆనంద్ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అద్భుతమైన నటులతో సినిమా తీసే అవకాశం రావడం గర్వంగా ఉందన్నారు. దీనికి సూర్య ప్రతి స్పందిస్తూ.. "కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు" అని తన ఆనందాన్ని వెల్లడించారు. జూన్ 25 నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభి౦చనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సూర్య సెల్వరాఘవన్ దర్శకత్వంలో "ఎన్జీకే" చిత్రంలో నటిస్తున్నారు. రకుల్ప్రీత్ సింగ్, సాయిపల్లవి కథానాయికలు.