హైదరాబాద్, మే 7 : విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి "ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్" అనే టైటిల్ ను ఖరారు చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికలుగా ఎవరు నటిస్తారు అనే విషయంపై చిత్రయూనిట్ ఇంకా స్పష్టతను ఇవ్వలేదు. తాజాగా ఈ చిత్రంలో కథానాయికలు ఫిక్స్ అయ్యారంటూ దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు. ఈ సినిమాలో వెంకీకి జోడీగా తమన్నా.. వరుణ్ తేజ్కు జోడీగా మెహరీన్ నటించనున్నారని.. వచ్చే నెల నుండి షూటింగ్ ను ప్రారంభిస్తామని ప్రకటించారు.