హైదరాబాద్, మే 5 : తెలుగుతనం ఉట్టిపడేలా కనిపించే కథానాయికలలో అంజలి ముందు వరుసలో ఉంటారు. ఇటీవల తెలుగులో ఒక్క సినిమాలో కూడా కనిపించడం లేదు. ఆ మధ కాలంలో విక్టరీ వెంకటేష్ లాంటి అగ్ర కథానాయకుడితో నటించింది. ఆ తర్వాత ఈ అమ్మడు పూర్తిగా టాలీవుడ్ లో కనుమరుగైపోయింది. ఈ విషయంపై ఆమెను ప్రశ్నించగా ఆమె స్పందించారు. "ఈ మధ్యకాలంలో నాకు తెలుగులో అవకాశాలు రావడం లేదు. తమిళంలో మాత్రం అవకాశాలు బాగానే వున్నాయి. దీంతో అక్కడే వుండిపోతున్నాను. నేను సన్నబడటం వలన తమిళంలో అవకాశాలు పెరిగాయి. తెలుగు నుంచి మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. మంచి పాత్రలతో వస్తే చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే వున్నాను" అని చెప్పుకొచ్చింది.