ఎల్. రమణ తీరుపై చంద్రబాబు అసంతృప్తి

SMTV Desk 2018-05-04 16:01:16  Chandrababu Naidu, class for telangana tdp leaders

హైదరాబాద్, మే 4: అమాయకంగా ఉంటే పార్టీ మనుగడ కష్టమని, దైర్యంగా ఉండి అందరినీ కలుపుకుని పోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ తీరుపై ఆ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేశారు. మహానాడు తరువాత మళ్లీ వస్తానని అప్పటిలోగా పార్టీ కమిటీలు పూర్తి చేస్తానని రమణకు బాబు చెప్పారు. జాతీయ మహనాడు తర్వాత తెలంగాణలో పర్యటిస్తానని, 2019లో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో తాను జాబితా సిద్ధం చేసుకున్నానని, ప్రతిభను బట్టి ముందుగానే టిక్కెట్లు కేటాయిస్తామన్నారు.