హైదరాబాద్, మే 4 : హీరోయిన్ మెహ్రీన్ వరుస అవకాశాలతో బిజీగా గడుపుతున్నారు. రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ సరసన నటించి మంచి మార్కులే కొట్టేసిన ఈ భామ ప్రస్తుతం.. గోపిచంద్, వెంకటేష్- వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మల్టీస్టారర్ లో నటిస్తోంది. అంతేకాకుండా విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశాన్ని సైతం అందిపుచ్చుకుంది. తాజాగా ఈ భామ మరో చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. "ఛలో" సినిమాతో విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ సరసన నటించే౦దుకు కథానాయిక మెహ్రీన్ ను సంప్రదించారట. ఇందుకు తను ఓకే చెప్పింది. త్వరలోనే ఈ చిత్రాన్ని మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.