హైదరాబాద్, మే 4 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వ౦లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇదివరకే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకొని తాజాగా రెండవ షెడ్యూల్ మొదలు పెట్టింది. ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ ను సంప్రదించారట. దర్శకుడు బోయపాటి శ్రీను తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో చరణ్ కూడా శ్రీకాంత్ తో చేయిస్తే బాగుంటుందని అన్నారట. ఇందుకు శ్రీకాంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన షూటింగ్ లో పాల్గొననున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో "గోవిందుడు అందరివాడేలే" వచ్చింది. బాబాయి, అబ్బాయిగా కలిసి నటించారు. కాగా ఈ చిత్రంలో చరణ్ సరసన కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.