"మెహబూబా" కు సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్‌..

SMTV Desk 2018-05-04 11:40:38  mehbooba sensored, mehbooba ua certificate, akash poori, poori jagannath.

హైదరాబాద్, మే 4 : పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆయన తనయుడు ఆకాష్ పూరి కథానాయకుడిగా తెరకెక్కించిన చిత్రం "మెహబూబా". శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్‌ ద్వారా నిర్మాత దిల్‌ రాజు.. ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఈ సందర్భంగా సినీ నటి ఛార్మీ మాట్లాడుతూ.. "మా సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. సెన్సార్‌ సభ్యులందరికీ ఈ సినిమా బాగా నచ్చింది. ఆకాష్ పూరి చాలా అందంగా ఉన్నాడు. అంతేకాకుండా లవ్‌ స్టోరీ చాలా బాగుందని చెప్పడంతో చాలా ఎనర్జీ వచ్చింది. సినిమాపై మరింత కాన్ఫిడెన్స్‌ వచ్చింది" అంటూ వెల్లడించింది. అలాగే ఆకాష్ పూరి, నేహా శెట్టి లు సైతం సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం అంటూ వీడియోను పోస్ట్ చేశారు.