రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

SMTV Desk 2018-05-04 10:31:29  road acccident car, lorry , 3 members death

మేడ్చల్, మే 4: తుర్కపల్లి గ్రామ సమీపంలో రాజీవ్ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కరీంనగర్‌ జిల్లా ధర్మపురి నుంచి శంషాబాదు ఎయిర్‌ పోర్టుకు వెళ్తు౦డగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సత్తవ్వ(35) , శ్రావణ్(10) , షాలిని(12)తో డ్రైవర్‌ రాజ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. సత్తవ్వ భర్త ఖతార్ నుంచి ఇండియాకు వస్తుండటంతో ఆయనకు కుటుంబసభ్యులు ఆహ్వానం పలికేందుకు ఎయిర్‌ పోర్టుకు బయలు దేరారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అందరూ చనిపోవడంతో బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.