గుంటూరు. మే 3: ఏపీలో సంచలనం సృష్టించిన తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారంపై దాచేపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. వర్షంలోను కూడా ఆందోళన కొనసాగుతున్నాయి. నడికుడి రైల్వేస్టేషన్లో శబరి ఎక్స్ప్రెస్ను, గూడ్స్ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. పిడుగురాళ్ల నుంచి నార్కట్పల్లి వెళ్లే వాహనాల దారి మళ్లించారు. ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు రూరల్ ఎస్పీ అప్పలనాయుడు యత్నిస్తున్నారు. ప్రజలు సహకరిస్తే నిందితుడిని పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు. గుంటూరు దాచేపల్లి లో తొమ్మిదేళ్ల బాలికపై 55 ఏళ్ల సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు ప్రస్తుతం పరారిలో ఉన్నాడు.