‘తరువాత ఎవరు’..?

SMTV Desk 2018-05-03 18:29:49  TARUVATHA YEVARU THIYETRICAL TRAILER, KRISHNA PRASAD DIRECTOR.

హైదరాబాద్, మే 3 : జి. కృష్ణ ప్రసాద్ దర్శకత్వంలో మనోజ్, ప్రియాంకాశర్మ, కమలాకర్ రాజు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "తరువాత ఎవరు..?". థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ రియాలిటీ షో నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి చిత్రబృందం ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. 10 రోజుల పాటు 10 మంది యువతీ యువకులను ఓ బంగ్లాలోకి పంపిస్తారు. వారందరికీ ఈ ఆట కచ్చితంగా ఆడి బయటకు వస్తే చాలా పాపులర్ అవుతారని.. వారికి 20 లక్షలు ఆశ చూపిస్తారు. కాని వారంతా అక్కడకు వెళ్ళగానే అక్కడ రోజుకో హత్య జరుగుతోంది. ఇంతకు హత్యలు చేస్తుందెవరు.? అసలు దీనికి కారణం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.