అవార్డు ప్రకటించగానే బోనీ భావోద్వేగం..!!

SMTV Desk 2018-05-03 15:43:12  sridevi, national award, bony kapoor, ramnath kovindh.

న్యూఢిల్లీ, మే 3 : దివంగత నటి శ్రీదేవికి తాను నటించిన "మామ్" చిత్రానికి గాను ఉత్తమ జాతీయ అవార్డు వరించిన విషయం తెలిసిందే. అయితే శ్రీదేవి తరపున ఈ అవార్డు అందుకోవడానికి భర్త బోనీ కపూర్ సహా పిల్లలు జాహ్నవి, ఖుషి లు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బోనీ కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీదేవికి అవార్డు ప్రకటించగానే బోనీ మీడియాతో మాట్లాడారు. "శ్రీదేవికి అవార్డు వచ్చినందుకు సంతోషించాలో.. దానిని అందుకోవడానికి తను ఈ లోకంలో లేనందుకు బాధపడాలో అర్థం కావడంలేదు" అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా జాతీయ అవార్డులను ప్రధానోత్సవం జరుగుతోంది. మొత్తం 140 మంది ఆర్టిస్ట్‌లు అవార్డులు ఈ అందుకోనున్నారు. ఇతరత్రా కారణాల వల్ల రాష్ట్రపతి కేవలం 11మందికే ఈ అవార్డును బహుకరించనున్నారు. మిగిలిన వారికి మంత్రులు ప్రధాన౦ చేయనున్నారు.