రాష్ట్రపతి చేతుల మీదుగా కేవలం 11 మందికే..!!

SMTV Desk 2018-05-03 14:26:32  president, ramnath kovindh, national awards, presentation.

న్యూఢిల్లీ, మే 3 : దేశ రాజధాని ఢిల్లీలోని విగ్యాన్‌ భవన్‌లో జాతీయ అవార్డులు ప్రధానం చేయనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా దాదాపు 140 మంది ఈ అవార్డులు అందుకోనున్నారు. అయితే విషయం ఏంటంటే.. రాష్ట్రపతి చేతుల మీదుగా కేవలం 11 మందే అవార్డులు అందుకోబోతున్నారట. మిగతా వారికి వివిధ శాఖల మంత్రులు అవార్డులు ప్రధానం చేస్తారని తెలుస్తోంది. నిజానికి 1954లో జాతీయ అవార్డులు ప్రవేశపెట్టిన నాటి నుండి జాతీయ అవార్డులు గెలుచుకున్న వారందరికీ రాష్ట్రపతి అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ. అయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా కేవలం 11 మందికి మాత్రమే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను ప్రధానం చేయనున్నారు. దీంతో పలువురు ప్రముఖులు నిరాశ చెందారట. ఇలా చేస్తే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మ్రతి ఇరానీ 75 మందికి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది.