అమరావతి, మే 2 : రాష్ట్రంలో కొద్దిరోజులుగా మండే ఎండలతో ప్రజలు నానాఇక్కట్లు పడ్డారు. అయితే అకస్మాత్తుగా పలు జిల్లాలలో వానలు భీబత్సం సృష్టించాయి. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు, పిడుగులతో ఒక్క సారిగా వాతావరణం మారిపోయింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విపత్తుల శాఖ మరోసారి హెచ్చరించింది. చిత్తూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వీలైతే సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.