హైదరాబాద్, జూలై 06 : ఇటీవల కాలంలో హరీష్ శంకర్ తెరకెక్కించిన దువ్వాడ జగన్నాథమ్ ఈ మద్యనే విడుదలై భారీ వసూళ్లను రాబట్టుతోంది. అల్లు అర్జున్ ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో ఈ సినిమా నైజామ్ ఏరియాలో 13 రోజులకు గాను 20 కోట్ల రూపాయల వసూళ్ళను రాబట్టింది. అయితే ఈ విషయం అవాస్తవమని సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీనిపై ఘాటుగా స్పందించిన హరీష్ శంకర్ ఈ లెక్కలు తప్పని ఎవరైనా నిరూపించగలిగితే తాను ఇకపై సినిమాలను తియ్యనని ఛాలెంజ్ చేశాడు.