హైదరాబాద్, మే 1 : సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర౦ "తేజ్ ఐ లవ్ యూ". సాయి ధరమ్ సరసన అందాల తార అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఎలాంటి డైలాగ్ లు లేకుండా కేవలం ఒక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సహా ఫీలింగ్ మిక్స్ చేసి ఈ టీజర్ ను విడుదల చేశారు. వర్షం పడుతు౦డగా ఒక బస్టాప్ లో సాయిధరమ్ తేజ్ నిల్చొని టీ తాగుతూ పక్కకు చూడగా అక్కడ అనుపమ పరమేశ్వరన్ గిటార్ వాయిస్తూ కనిపిస్తోంది. దీంతో సాయిధరమ్.. అనుపమ వచ్చి తన కౌగిలిలో ఉండి టీ తాగుతున్నట్లు ఊహించుకుంటాడు. ఇంతలో హారన్ సౌండ్ అయి కళ్ళు తెరిచి చూడగా అక్కడ ఎవరు ఉండరు. ఇంతటి ఫీల్ ఉన్న ఈ టీజర్ ను తేజ్ ఫస్ట్ ఫీల్గా చిత్రబృందం రిలీజ్ చేసింది. సింపుల్ గా ఎంతో సైలెంట్ గా సాగిపోతున్న ఈ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.