నెల్లూరు, మే 1: అనీశా వలకు అవినీతి చేప చిక్కింది. రవాణా శాఖలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నా సరసింహా రెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ(అనీశా) అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. జిల్లాలోని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆయన ఇల్లు, కార్యాలయంతో పాటు పట్టణంలోని బంధు, మిత్రుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. ఈ దాడుల్లో నగదు, పెద్ద ఎత్తున డాక్యుమెంట్ పత్రాలను స్వాధీనపరచుకున్నారు. పలువురు రవాణా శాఖ ఉద్యోగులకు నరసింహారెడ్డి బినామీగా వ్యవహరిస్తూ, భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు దాడుల్లో అధికారులు గుర్తించారు.