హైదరాబాద్, ఏప్రిల్ 30: ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకోవడం లేదని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు తీవ్రం గా స్పందించారు. ప్రాజెక్టులను కాంగ్రెస్ ఏ విధంగా అడ్డుకుంటున్నదీ సాక్ష్యాధారాలతో నిరూపించడానికి సిద్థంగా ఉన్నానని అన్నా రు. ఈ అంశంపై బహిరంగ చర్చకుగానీ గాంధీభవన్లో చర్చకు కానీ తాను సిద్ధమేనని హరీశ్రావు సవాల్ చేసారు. తెలంగాణ భవన్లో ఆదివారం సాయం త్రం మంత్రి హరీశ్రావు సమక్షంలో మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు టిఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ, మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రాజెక్టులపై ఒప్పందం చేసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లినప్పుడు కూడా ఉత్తమ్కుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సవాల్ చేస్తే రాకుండా పారిపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని, మరో ఇరవై ఏళ్ల వరకు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు.