విశాఖపట్నం, ఏప్రిల్ 29: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా విషయంలోఅనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రేపు విశాఖపట్నంలో ‘వంచన వ్యతిరేక దీక్ష’ను నిర్వహిస్తోంది. మహిళా డిగ్రీ కళాశాల ఎదుట వైఎస్సార్సీపీ నేతలు ఈ దీక్షలో పాల్గొననున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగనున్న ఈ దీక్షలో హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలు, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలుచేయని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు ఈ దీక్ష జరగనుంది.