కాపుల్ని బీసీలో చేర్చుతారా?

SMTV Desk 2017-07-06 15:56:48  mudragada padmanabad, ap deputy cm,china rajappa

గుంటూరు, జూలై 06 : కాపుల్ని బీసీలో చేర్చేందుకే ప్రభుత్వం మంజునాధ కమిషన్ ను నియమించిందని ఏపీ డిప్యూటీ సీఏం చినరాజప్ప తెలిపారు. ఈ విషయం తెలిసి కూడా ముద్రగడ ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. ముద్రగడ పాదయాత్రకి అనుమతి కోరలేదని, అడిగితే మాత్రం ఇస్తామన్నారు. అనుమతి పొందకుండా పాదయాత్ర చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు హోం మంత్రి చినరాజప్ప. 30 ఏళ్లలో ముద్రగడ చేయలేనిది ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బీసీలకు ఇబ్బంది లేకుండానే కాపులు బీసీలో చేరుతారని, దీంట్లో ఎటువంటి అస్పష్టత లేదని ఆయన వివరించారు.