ఎయిర్‌టెల్ మరో కొత్త ఆఫర్

SMTV Desk 2018-04-26 18:36:20  Indian airtel, latest offers, realeased

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారతీ ఎయిర్‌టెల్ మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ. 219తో రీచార్జి చేసుకుంటే అపరిమిత లోకల్, ఎస్టీడీ ఫోన్ కాల్స్‌తోపాటు ఎస్‌ఎంఎస్‌లు చేసుకోవచ్చని ఎయిర్‌టెల్ కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్ ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్‌ను తీసుకునే ప్రీపెయిడ్ కస్టమర్లకు ప్రతి రోజు 1.4జీబీ డేటాతోపాటు హలో ట్యూన్స్ ప్రయోజనం పొందుతారని కంపెనీ వెల్లడించింది. ఈ ఫ్లాన్‌ను ఎంపిక చేసుకున్న ప్రీపెయిడ్ వినియోగదారులకు 28 రోజుల కాలపరిమితితో 3జీ, 4జీ ఫోన్ మొబైల్స్ కస్టమర్లకు ప్రతి రోజు 1.4జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చని సంస్థ తెలిపింది.