ఐపీఎల్‌-12 ధమాకా దుబాయ్‌లో..!

SMTV Desk 2018-04-26 11:36:59  ipl-12 season, bcci, uae host, kolkata

కోల్‌కతా, ఏప్రిల్ 26 : ఐపీఎల్ -12 సీజన్ యూఏఈకి తరలించే అవకాశముంది. దేశంలో జరగబోయే 2019 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్‌ మ్యాచ్‌లకు భద్రత కల్పించడంపై సందేహాలు నెలకొన్నాయి. 12వ సీజన్‌ ఐపీఎల్‌ మార్చి 29 నుంచి మే 19 మధ్య జరగనుంది. సరిగ్గా ఇదే సమయంలో దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వహణ కష్టంగా మారనుంది. టోర్నీ యూఏఈలో జరిగితే షార్జా, దుబాయ్‌, అబుదాబిలు వేదికలుగా ఉంటాయి. గతంలో రెండు సార్లు ఐపీఎల్‌ను ఇతర దేశాల్లో నిర్వహించారు. 2009 సార్వత్రిక ఎన్నికలతో దక్షిణాఫ్రికాలో నిర్వహించగా.. 2014 ఎన్నికలతో యూఏఈలో నిర్వహించారు.