సీఎం దీక్షపై పవన్ కుట్ర: బోండా ఉమ

SMTV Desk 2018-04-23 17:59:59   Bonda uma, pawankalyan, Chandrababu, AP special status

విజయవాడ, ఏప్రిల్ 23: సీఎం చంద్రబాబు దీక్షపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ హైదరాబాద్‌లో కూర్చొని కుట్ర చేశారని ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వర్ రావు ఆరోపించారు. మీడియాను, పార్టీలను పవన్‌కల్యాణ్‌ టార్గెట్ చేస్తున్నారని, ప్రధాని మోదీపై పవన్‌ నోరెత్తడం లేదని నిలదీశారు. ట్వీట్‌లతో రాజకీయాలు చేస్తే విజయవంతం కాలేరని సూచించారు. పవన్‌పై శ్రీరెడ్డి ఆరోపణలను టీడీపీకి ఎలా అంటగడతారని, జనసేనతో కలిసి బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ, జనసేన, వైసీపీ రహస్య ఎజెండా ఏంటో చెప్పాలన్నారు.