తెరాస ప్లీనరీ ఏర్పాట్లపై కేటీఆర్‌ సమీక్ష

SMTV Desk 2018-04-23 17:07:56   Ktr, ts minister, pleenaree, review meeting

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఈ నెల 27న జరగబోయే తెరాస ప్లీనరీ ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్లీనరీ నిర్వహిస్తారు. ప్లీనరీ ఏర్పాట్ల కోసం 9 కమిటీలు వేశామని, ప్లీనరీకి 12వేల నుంచి 13 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని ఆయన తెలిపారు. విద్యార్థి విభాగం నుంచి 500 మంది వాలంటీర్లు సేవలు అందిస్తారని, ఫెడరల్ ఫ్రంట్, అభివృద్ది, సంక్షేమ పథకాలపై విస్తృతంగా చర్చిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది ప్రతినిధులు వస్తారని అంచనా వేస్తున్నట్టు కేటీఆర్‌ వివరించారు.