విజయవాడ, ఏప్రిల్ 23: రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ అప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు దీక్ష చేశారు. ఆయనకు మద్దతుగా కేడీసీసీ, ఆప్కాబ్ బోర్డు సభ్యులు, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు, సిబ్బంది ఆదివారం విజయవాడ కేడీసీసీ బ్యాంక్ ఆవరణలో పది గంటల దీక్ష నిర్వహించారు. ఎన్జీవో మాజీ అధ్యక్షుడు నారాయణరావు దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీని బీజేపీ నెరవేర్చడం లేదని, దాన్ని సాధించుకోవడానికి వివిధ రూపాల్లో పోరాడుతున్నామన్నారు. గ్రామస్థాయి వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.