ఇండోర్, ఏప్రిల్ 23 : ఐపీఎల్ టోర్నీలో దశాబ్దకాలంగా క్రికెట్ అభిమానులను ఎంతోగానో అలరిస్తుంది. ఇప్పుడు మొదలైన ఐపీఎల్-11 రసవత్తరంగా సాగుతుంది. మొత్తం ఎనిమిది జట్ల పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు మూడు జట్లు ట్రోఫీని గెలుచుకోలేకపోయాయి. అందులో కింగ్స్ X1 పంజాబ్ జట్టు ఒకటి. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సహ యజమాని బాలీవుడ్ భామ ప్రీతి జింతా. ఈ ఏడాది ఐపీఎల్లో ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క ఓటమితో పంజాబ్ దూసుకెళ్తోంది. టోర్నీలో భాగంగా తాజాగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ విజయం అనంతరం ప్రీతి ఆనందానికి అవధుల్లేకుంటా పోయింది. మ్యాచ్ అనంతరం ప్రీతి పంజాబ్ జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్తో మాట్లాడుతూ.. ‘ఒకవేళ ఈ ఏడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజేతగా నిలిస్తే జట్టు కోసం ప్రత్యేకంగా ఏదో ఒకటి చేస్తా. అదేంటో ఇప్పుడు మాత్రం చెప్పను. ప్రస్తుతం పంజాబ్ వరుస మ్యాచ్లు గెలుస్తూ దూసుకుపోతోంది. ఇదే విజయ పరంపరను కొనసాగిస్తూ పంజాబ్ టోర్నీ విజేతగా నిలవాలి’ అని ఆశాభావం వ్యక్తం చేసింది. టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్లో పంజాబ్.. డిల్లీ డేర్డెవిల్స్తో తలపడనుంది.