ప్రధాని పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదు: బాలయ్య

SMTV Desk 2018-04-22 17:39:15   PM modi, Tdp MLA Balakrishna,

గుంటూరు, ఏప్రిల్ 22: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, ఆవేదనను మాత్రమే వ్యక్తం చేశానని సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని వెల్లడించానని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో నిర్వహించిన 12 గంటల నిరాహార దీక్షలో పాల్గొన్నబాలకృష్ణ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ రోజు గుంటూరు చిలకలూరి పేటలో బాలకృష్ణ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యపై స్పందిస్తూ ఈ విధంగా వివరణ ఇచ్చారు.