హైదరాబాద్, ఏప్రిల్ 22 : ఐపీఎల్ లో భాగంగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్- సన్ రైజర్స్ జట్టు మధ్య మ్యాచ్ లో రైజర్స్ సారథి కెన్ విలియం సన్ టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ జట్టులో శిఖర్ ధావన్ కు బదులు రికీ బుయి చోటు దక్కించుకొన్నాడు. గత మ్యాచ్లో గాయపడ్డ ధావన్ కోలుకోలేదని, అతని స్థానంలో రికీ బుయ్ అరంగేట్రం చేస్తున్నట్లు మిలియమ్సన్ తెలిపాడు. అటు చెన్నై జట్టులో ఫా డుప్లెసిస్ వచ్చి చేరాడు. పటిష్ట బౌలింగ్ వనరులు కలిగిన సన్రైజర్స్ హైదరాబాద్.. బెస్ట్ బ్యాటింగ్ లైనప్ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.