షిర్డీ సాయిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

SMTV Desk 2018-04-20 16:13:37  telanagana, cm KCR, shiridi tour

హైదరాబాద్, ఏప్రిల్ 20: మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్టీ సాయిబాబా ఆలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన షిర్డీకి బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట కుటుంబసభ్యులు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ఉన్నారు. సాయిబాబా ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు ఆలయ నిర్వహకులు స్వాగతం పలికారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో సాయిబాబాను దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కేసీఆర్‌ తిరిగి ఈరోజు సాయంత్రానికి‌ హైదరాబాద్ చేరుకోనున్నారు.