హైదరాబాద్, ఏప్రిల్ 19 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఘాటుగా స్పందించారు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఏచూరి ఈ సందర్భంగా మాట్లాడారు. సీపీఎం మహాసభల్లో రాజకీయ తీర్మానం గురించి చర్చించినట్లు తెలిపారు. అలాగే బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయ౦గా కేసీఆర్ తీసుకురానున్న కూటమిని మూసినదితో పోల్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, పార్టీ సభ్యుల ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.